తెలంగాణ సర్కా ర్ వ్యవసాయాన్ని దండగ కాదు పండుగలా మా ర్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్దులయ్యా రు. ఇందులో భాగంగానే వ్యవసాయశాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. రైతులకు పంట పెట్టుబడి కోసం ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్ రై తుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తూ రైతుల్లో భరోసా నింపారు. ఇదిలా ఉండగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ శరత్ జిల్లాలో ఇప్పటి వరకు పొలం ఉండి రుణాలు పొందని రైతులందరికీ బ్యాంకుల ద్వారా పంట రుణం ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు బ్యాంకుల్లో రుణాలు పొందని రైతుల జాబితాను సిద్ధం చేశారు. సేకరించిన డాటాను జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులకు అందించారు.
రైతులందరికీ పంట రుణాలు